ఇవి తినండి..
రాత్రి 8-9 గంటల ప్రాంతంలో భోజనం చేస్తే.. తిరిగి ఉదయం 8 తర్వాతే తింటారు చాలా మంది. అంటే.. ఈ రెండు భోజనాల మధ్య దాదాపు 12 గంటల గ్యాప్ ఉంటుంది. ఇంత గ్యాప్ తినేటప్పుడు శరీరానికి శక్తినిచ్చే, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి తప్ప, నష్టం కలిగించే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని నిపుణుల సూచన.
పీచు కంపల్సరీ..
పొద్దున్నే తినే ఆహారంలో తప్పకుండా పీచు ఉండేలా చూసుకోవాలని లుడ్విగ్ సూచిస్తున్నారు. ఇందుకోసం.. రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలతో చేసిన పదార్థాలు తినాలని చెబుతున్నారు. వీటితో తయారైన బ్రెడ్, అటుకులు, ఓట్మీల్ వంటివి మంచి ఆప్షన్ అని అంటున్నారు.
మాంసకృత్తులు..
పీచుతోపాటు మాంసకృతులు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం.. ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు వంటి మంచి ఆహారమని చెప్పారు. ఈ పదార్థాల నుంచి మాంసకృత్తులు మాత్రమే కాకుండా.. ఖనిజాలు, అత్యవసర విటమిన్లు కూడా అందుతాయని అంటున్నారు.
ఆ తిండి అసలే వద్దు..
ఉదయం టిఫెన్ అనగానే టిఫెన్ సెంటర్లకు పరిగెత్తేవాళ్లే ఎక్కువ. అక్కడ దొరికే టిఫెన్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ.. పలు రకాల కారణాలతో బయటే తింటూ ఉంటారు. అయితే.. ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. బయట దొరికి పదార్థాల్లో అధిక ఉప్పు, నూనె ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల అనారోగ్య కారకాలు బాడీలో చేరుతుంటాయి. అందుకే.. ఇంట్లోనే తినడం మంచిదని డేవిడ్ సూచిస్తున్నారు.
ఇవి కూడా తినండి..
పైన చెప్పుకున్న పీచు, మాంసకృతులతోపాటు తాజా పండ్లు, బాదం, సోయాపాలు, ఆక్రోట్, కాయగూరలు వంటివి తినాలని సూచిస్తున్నారు. కాజు, వాల్ నట్స్ వంటివి యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు.