జడ్చర్ల
విపరీతమైన కడుపునొప్పి తో బాధపడేవారు అదేవిధంగా స్త్రీలకు సహజసిద్ధంగా రుతుక్రమంలో వచ్చే కడుపునొప్పి నివారణకు ఈ గుణం లోని నీళ్లు కడుపునొప్పిని నివారించేవని స్థానికులు పూర్తి అనుభవంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అంతేకాకుండా అన్ని కాలాల్లో ఇంత ఎత్తు పై నీళ్లు ఉండడం అనేది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం.
ఇక్కడ ఈ గుండంలో నిరంతరం ఎడతెగని నీటి జాలు (ఊట) ఉందని పెద్దలంటారు.
నీటికి ఆధారమైన ఊరు కాబట్టే జలచర్ల అనే పేరు ఏర్పడిందని చారిత్రకుల అభిప్రాయం.
ఈ గుండంలో ఒక పెద్ద సొరంగ మార్గంలో నీటిజాలు ఉందని స్థానికులు అభిప్రాయం.
ఒక పెద్ద చేదురు బావి కూడా ఈ గుండం అట్ట డుగులో ఉందని పెద్దలంటారు.
పురాతన దేవాలయాలు మన సంస్కృతికి నిలయాలు. మన ఇతిహాసానికి ఆనవాళ్లు.
ఆ ఆనవాళ్లను చెరిపి వేసుకోవడం అనేది మన సంస్కృతిని మనమే కాలరాసుకోవడం అవుతుంది.
జడ్చర్ల వాసులకు కొంగుబంగారమై అలరారుతున్న శ్రీ రంగనాయకుని వైభవాన్ని దూరం చేసుకుంటే జడ్చర్ల పట్టణం శోభ దూరమైనట్లే అని భావించాలి.
ఇది జడ్చర్ల వాసులు చుట్టుపక్కల గ్రామాల వారు ఏమాత్రం హర్షించరు. అంతేగాక అరిష్ట దాయకం.
గోన గన్నారెడ్డికి ఇద్దరు సోదరులు; గోన కాచారెడ్డి, గోన విఠలనాథ, సోదరి కుప్పాంబిక ఉన్నారు. వీరు కవులు. గోన కాచా రెడ్డి, విఠలనాథ రచనలలో రంగనాథ రామాయణములో ఉత్తరకాండ విభాగాన్ని పూర్తి చేసిన రచనలు ఉన్నాయి. రంగనాథ సంస్కరణ తెలుగు సాహిత్య చరిత్రలో గోన గన్నారెడ్డి రచించిన మొదటి, అగ్రశ్రేణి రామాయణం. అతని సోదరి, కుప్పాంబిక బుద్ధపురం శాసనాల ప్రకారం మొదటి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి చెందినదని తెలుస్తుంది. కుప్పాంబిక మాల్యాల గుండదండాదీశుని వివాహం చేసుకుంది. అతడిని దండ సేనాని అని కూడా అంటారు.