ఎమ్మెల్యేలను కొనడం ఆపి నిరుద్యోగుల సమస్య చూడు రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి BJYM జిల్లా అధ్యక్షులు--పల్లె తిరుపతి

 నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్

ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు BJYM ఉద్యమం ఆగదు

BJYM జిల్లా అధ్యక్షులు--పల్లె తిరుపతి

నిరుద్యోగ యువతకు అండగా BJYM



BJYM రాష్ట్ర డాటా సెల్ కన్వీనర్ అరవింద్ రెడ్డి

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడంతో ఈరోజు మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేసి అనంతరం జెసి శంకర్  గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా .. పల్లె తిరుపతి మాట్లాడుతూ.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ,గద్దెనెక్కిన తర్వాత ఆరు గ్యారంటీలు కాదు ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు హామీలు మరిచి చేరికల మీద దృష్టిపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్. నిరుద్యోగులను, మహిళలను,రైతులను ,పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదాణమై తెచ్చుకున్న తెలంగాణా లో గతం లో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని,ఇప్పుడు రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు. బీజేవైఎం న్యాయమైన డిమాండ్ లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని,గ్రూప్ - 2, గ్రూప్ - 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను Postpone చేసి నూతన తేదీలను ప్రకటించాలని,అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్  కేటాయించాలని ,పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న G.O. No. 46ను వెంటనే రద్దు చేయాలని అదేవిదంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లోని అన్ని వర్గాల ప్రజలను యువత ను మోసం చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు BJYM ఉద్యమం ఆగదని తీవ్రంగా హెచ్చరించారు.అరవింద్  మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని అన్నారు.

ఎంతో మంది యువత ఆత్మ బలిదానమైతే తెలంగాణా రాష్ట్ర ఏర్పడ్డదని,మరి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.

న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని, నిరుద్యోగ యువతకు బీజేవైఎం అండగా ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం యువమోర్చా నాయకులు నవీన్ రెడ్డి , శ్రీధర్ ,వెంకటేష్ , శివ, కుమార్, శివకృష్ణ , విష్ణు, చెన్నకేశవులు, నరేందర్, అంజి , నరేష్ నాయక్ , రాహుల్ నాయక్, కన్న, మల్లేష్ ,నవీన్ , మహేష్ , ఉదయ్ కుమార్, అజయ్ యాదవ్ , అరుణ్ యాదవ్, ప్రేమ్ కుమార్ , విష్ణు, రాఘవేంద్ర గౌడ్ , యశ్వంత్, మహేష్, హరీష్, చెన్నయ్య, నరేష్, అభిషేక్, చెన్నయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు


Previous Post Next Post

نموذج الاتصال

Follow Me