తెలంగాణ దక్షిణ భారత ముఖ ద్వారంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణాలో అభివృద్ధి విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి, మోదీ చాలా ప్రాధాన్యత ఉందని, కానీ రాష్ట్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య చితికిపోతోందని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కిషన్ రెడ్డి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్స్..
మరి కాసేపట్లో ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది..
కాని ఈ షెడ్యూల్ కన్నా ముందే ప్రజలు ఫలితాలను ఇచ్చారు.. మారో సారి బీజేపి ప్రభుత్వమే.. తెలంగాణా కూడా ఇదే ఫలితం ఉంటుంది.
నిన్న మల్కాజ్ గిరి లో ఇదే చూసాను. అక్కడ ప్రజలు బిజెపి ని ఆశీర్వదించారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర కోపం.. వారిని ఓడించింది..
ఇపుడు మోడీ పట్ల ప్రజానీకం మొత్తంగా ప్రేమ కనిపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో BRS పై విపరీతమైన కోపం చూసానని.. తెలంగాణ ప్రజలు మోదీని తిరిగి ఎన్నుకోవాలని చూస్తున్నారన్నారు. మూడోసారి మోదీ సర్కార్.. అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను గెట్ వే ఆఫ్ సౌత్ అంటారని కోడ్ రాక ముందే ఇక్కడి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని రెండూ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. గత 10ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో తెలంగాణకు ఒరిగేది ఏం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. రెండు పార్టీల తెలంగాణ ఆశయాలను నాశనం చేశాయంటూ పేర్కొన్నారు.
దేశ ప్రజల గుండెల్లో బీజేపీ ఉందని, ఈ సారి తమకు 400 సీట్లు రాబోతున్నాయని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనను మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని.. ఈ సారి తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్లను గెలిపించాలని కోరారు. తమ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందని.. కానీ కాంగ్రెస్ పాలనలో దోచుకోవడమే సరిపోయిందని తెలిపారు. మోదీ కుటుంబం అంటే 140 కోట్ల భారతీయులు అని.. మోదీ గ్యారెంటీ అంటే అన్ని గ్యారెంటీల అమలు అంటూ ప్రధాని పేర్కొన్నారు.
