ఉత్తరఖండ్ లో కూలిన సొరంగ మార్గం*

డెహ్రాడూన్:నవంబర్ 12 ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు లోపల చిక్కుకున్నట్టు సమాచారం.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్‌యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం.ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో టన్నెల్‌లో ఉన్న 150 మీటర్ల పొడవైన సొరంగ భాగం కూలింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వుతున్నారు.....
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow