మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ పరిషవేధీశ్వర ఆలయానికి సిసి రోడ్డు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని శాసనసభ్యులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీతో సమావేశమయ్యారు.
దేవాలయ అభివృద్ధి కొరకై సిసి రోడ్డు నిర్మాణం మరియు దుందుభి నది పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులతో అభివృద్ధికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడగల్ యాదయ్య రాజపూర్ జెడ్పిటిసి మోహన్ నాయక్ డిసిసిబి చైర్మన్ పి ప్రభాకర్ రెడ్డి ..మార్కెట్ డైరెక్టర్ సిపి వెంకటయ్య కత్తి కాడయ్య రామవతార్ బైరంపల్లి సర్పంచ్ మల్లమ్మ బీరయ్య కుర్వగడ్డ పల్లి మాజీ సర్పంచ్ వెంకటేశు మరియు దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి కొత్తపల్లి యాదయ్యకైలాస్ పుట్టపర్వతాలు భజన మండలి అధ్యక్షులు కే దామోదర్ మరికల్ కృష్ణ మల్లేష్ సురేందర్ గౌడ్ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బి గోపాల్ ముదిరాజ్ పాల్గొన్నారు.
Tags
News@jcl
