Praja Bhavan Accident: ఎట్టకేలకు అరెస్ట్.. పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు..
Ex MLA Son Case: నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు రహిల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. షకీల్ కొడుకు రహిల్ ను పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్ను ఢీకొట్టిన కేసులో రహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు..
Ex MLA Son Case: నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు రహిల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. షకీల్ కొడుకు రహీల్ ను పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్ను ఢీకొట్టిన కేసులో రహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. శంషాబాద్ ఏయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహీల్ ను కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇదిలాఉంటే.. ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై ఉన్న లుకౌట్ నోటీస్ కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ నాలుగు నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్ తండ్రి షకీల్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన రహీల్ తనపై ఉన్న లుకౌట్ నోటీస్ కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు రాత్రి సమయంలో ప్రమాదం జరిగిందని.. బారికేడ్ దగ్గర సరైన సిగ్నలింగ్ ఏర్పాటు చేయలేదని ఆరోపించాడు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కేసు నమోదు చేయాలన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు రహిల్ ను అరెస్టు చేశారు.
Tags
News@jcl