కారులో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త...
కారు అద్దం ధ్వంసం చేసి..పట్టపగలే
రూ.13 లక్షలు కాజేసి!
బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచిన ఓ
కారు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. అందులోంచి రూ.13 లక్షలతో పరారయ్యారు.
పట్టపగలు.. చుట్టూ జనాలు ఉండగానే ఈ చోరీ
జరగడం గమనార్హం. బెంగళూరు (Bengaluru) లో
వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ
ఫుటేజీ వైరల్గా మారింది.
పోలీసుల వివరాలు, సీసీ
పుటేజీ ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు
దుండగులు స్థానికంగా నిలిపి ఉంచిన ఓ బీఎండబ్ల్యూ కారు వద్ద తచ్చాడుతూ కనిపించారు.
ఒకరు బండిపైనే ఉండగా.. మరొకరు కారు డ్రైవర్
వైపు ఉండే అద్దాన్ని ధ్వంసం చేసి, అక్కడినుంచే
లోపలికి ప్రవేశించాడు.
ఈ క్రమంలోనే రూ.13 లక్షల
నగదు చోరీ చేసి, తాపీగా ఇద్దరు బైక్పై
పరారయ్యారు. నిందితులు ముఖానికి మాస్కు
వేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇదంతా అక్కడున్న
కెమెరాల్లో నిక్షిప్తమైంది. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై కేసు
నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సర్జాపుర్ పోలీసులు తెలిపారు.
Tags
News@jcl