_తాజా సమాచారం_
*షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్*
*మేము దళితులమే మాకు ఎవరు న్యాయం చేస్తారు..?*
*24 తులాల బంగారం, రెండు లక్షల నగదును సునిత చోరీ చేసింది*
*మీ రాజకీయాల కోసం మా కేసును పక్కదారి పట్టించొద్దు*
*సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు సమాధానం చెప్పాలి*
*పెళ్లి కోసం దాచుకున్న సొత్తుంతా దోచేశారు*
*ఇప్పుడు పెళ్లి జరగకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం*
*థర్డ్ డిగ్రీ చేయమని నేను చెప్పలేదు దానికి మేము కూడా వ్యతిరేకమే*
*ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి*
*ఎస్సీ కమిషన్ కు మేము దళితులమని తెలియదా..?*
*ఊరిలో ఉన్న సునీతను తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టి ఇదంతా రాజకీయం చేస్తున్నారు*
*రౌడీ షీటర్ గురించి మాట్లాడే నాయకులు సునీత భర్త రౌడీషీటర్ అని మీకు తెలియదా..?*
*మీ రాజకీయ కోసం మమ్మల్ని వాడుకుంటారా అంటూ బంగారం పోయిన బాధితుల గగ్గోలు*
*షాద్ నగర్ లో సునీత బాధితుల మీడియా సమావేశం*
మేము దళితులమే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రతి పైసా కూడా పెట్టి పెళ్లి కోసమని దాచుకున్న 24 తులాల బంగారం రెండు లక్షల నగదు దోచుకుని ఈరోజు మా దొంగతనం కేసును రాజకీయంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నాయకులకు తండ్రి లేని పిల్లలం మా గోస కనిపించలేదా? అంటూ షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన బంగారం, నగదు దొంగతనం జరిగిన ఇంటి బాధితులు హుబ్బని నాగేందర్, అతని భార్య నీలవేణి, బాధితుడు సోదరి రేణుక వాపోయారు.
సోమవారం సాయంత్రం బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
తమ ఇంట్లో గత నెల 24వ తేదీన బంగారం చోరీ జరిగిందని చెప్పారు. తను కంది వనంలో ఓ ఆర్ ఎం పి వైద్యుడిగా పనిచేస్తున్నట్టు చెప్పారు తన భార్య నీలవేణి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుందని అదేవిధంగా తన సోదరి రేణుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగా పని చేస్తున్నట్టు చెప్పారు. పైసా పైసా కూడబెట్టి తన చెల్లి రేణుక పెళ్లి కోసం 24 తులాల బంగారం కూడబెట్టానని చెప్పారు. 24వ తేదీ తాము తమ ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలు వచ్చేసరికి ఇంటి లోపల నుండి గడియ పెట్టి ఉందని పిల్లలు వెనుక భాగం నుండి వచ్చి చూడగా ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయని బీరువా తలుపులు కూడా తెరిచి వస్తువులు చిందరవందరగా పడ్డాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఉద్యోగాల నుండి వచ్చిన తాము షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. డిటెక్టివ్ సిఐ రాంరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు.
*ఆ తర్వాత ఏం జరిగిందంటే..?*
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత పోలీసు బాధితురాలుగా చెప్పుకుంటున్న సునీత తమ ఇంటి ముందు గల్లీలో ఇంటి గడపపై కొన్ని బంగారు వస్తువులు పెట్టిందని ఇది తమ సోదరి రేణుక కళ్ళారా చూసిందని చెప్పారు. ఆ కవర్లో ఏముందని చూడగా తమకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని బాధితుడు నాగేందర్ చెప్పారు. అదేవిధంగా ఈ వస్తువులు నీకెలా వచ్చాయని సునీతను నిలదీయగా ఆమె కాలనీలో ఉన్న మల్లేశ్వరికి మిగతా సొమ్ములు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు సునితను, మల్లీశ్వరిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారని చెప్పారు. ఆ తర్వాత అవే వస్తువులను మళ్లీ శ్రీరామ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టినట్టు చెప్పారని ఆ షాపుకు కూడా వెళ్లి చూశామని అక్కడ కూడా అబద్ధాలు చెప్పిందని చెప్పారు. ఆ తరువాత తిరుమలాపూర్లో ఉన్న సునీత సోదరుడుకు బంగారు వస్తువులు ఇచ్చినట్టు పోలీసులకు తప్పుడు సమాచారం సునీత పదేపదే ఇచ్చిందని చెప్పారు. ఇదే అనుమానంపై పోలీసులు సున్నితను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని చెప్పారు.
*థర్డ్ డిగ్రీ జరిగిందో ఏం జరిగిందో మాకేం తెలుసు..*
థర్డ్ డిగ్రీ జరిగిందని సునీత గగ్గోలు పెట్టడంతో తమ కేసు పక్కదారి పట్టిందని అసలు పోలీసులు విచారణలో ఏం చేశారు? తమకు తెలియదని అన్నారు. పోలీస్ స్టేషన్ లో తమను పిలిచి ఈమెకు జమానత్ ఎవరు ఇవ్వడం లేదని సునీతకు జమానత్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని చెబితే మానవతా దృక్పథంతో తాము ఆమెకు జమానత్ ఇచ్చి తన కారులోనే ఇంటికి తీసుకువచ్చి వదిలిపెట్టామని చెప్పారు. ఇప్పుడు దానిని కూడా తప్పుగా మీడియాలో చిత్రీకరిస్తున్నారని వారు అన్నారు.
*ఎస్సీ కమిషన్ కు మేము దళితులమని తెలియదా..?*
ఎస్సీ కమిషన్ సునీత విషయంలో స్పందించి తమ విషయంలో వదిలేయడం ఏమిటని? బాధితులు నాగేందర్, నీలవేణి, రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తాము దళితులమేనని మమ్మల్ని మా బాధలను ఎందుకు పట్టించుకోవడంలేదని ఎస్సీ కమిషన్ సభ్యులను ప్రశ్నించారు. విచారణలో పోలీసులు ఏం చేశారో తమకు తెలియదని అలాంటివి తాము కూడా కోరుకోలేదని తమకు అన్యాయం జరిగిందని పెళ్లి కోసం దాచుకున్న వస్తువులు, నగదు డబ్బులు పోయినందుకు తాము ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎక్కడో పాపిరెడ్డి గూడలో ఉన్న సునీతను ఎస్సీ కమిషన్ సభ్యుల కోసం నాటకీయంగా కొందరు తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పేరిట డ్రామాలాడుతూ
కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దీనికి మాకు ఏం సంబంధం అని వారు ప్రశ్నించారు. నిజమైన నాయకులు రాజకీయాలకు అతీతంగా ఉంటే తమను కూడా పరామర్శించాలని తమ ఇంట్లో 24 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణకు గురైతే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న సునీతను తీసుకొచ్చి ఎప్పుడో వారం క్రితం జరిగిన సంఘటన తర్వాత నాటకీయంగా ఆసుపత్రిలో పెట్టి అంతా కొత్తగా చిత్రీకరిస్తున్నారని వారు ఆవేదన చెందారు.
*సబితమ్మా వస్తువులు ఇప్పించు*
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివారు మా ఊరికి వచ్చి ఏకపక్షంగా ఒకరి వాదన విని వెళ్లిపోవడం సరికాదని చెప్పారు. అసలు దొంగతనం జరిగిందా? జరగలేదా? తెలుసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాధితులు పేర్కొన్నారు. పెళ్లి కోసం దాచుకున్న 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయిందని చెబితే తాము కూడా దళితులమేనని ప్రతి పైసా కూడబెట్టి కొన్నామని ఏళ్ల తరబడి సంపాదించుకున్న తమ సొత్తు పుణ్యానికి దోచుకున్నారని అలాంటి వారికి మద్దతు ఇచ్చిన నాయకులు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
*రౌడీ షీటర్ల గురించి మాట్లాడారు.. ఆమె భర్త రౌడీషీటర్ మీకు తెలుసా..?*
రౌడీ షీటర్ల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సునీత కుటుంబంలో నేర చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకోని మాట్లాడాలని కోరారు. సునీత కుటుంబంలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి? సునీత భర్త
భీమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లోనే రౌడీషీటర్ గా ఉన్న విషయం బీఆర్ఎస్ నాయకులకు తెలియదా అని వారు ప్రశ్నించారు.
*మీ కాళ్లు మొక్కుతా.. మా కేసు పక్కదారి పట్టించకండి*
మీ కాళ్లు మొక్కుతా మా దొంగతనం కేసు పక్కదారి పట్టించకండి, ఎన్నో ఏళ్లుగా డబ్బులు దాచుకొని ఒక్కో వస్తువు పెళ్లి కోసమని కొన్నామని 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు తీసుకెళ్లిన వారిపై పోలీసులు సక్రమంగా విచారణ జరిపి తమ వస్తువులు రికవరీ అయ్యేవిధంగా చూడాలని వారు రాజకీయ పార్టీలకు నివేదించారు. తమ వద్దకు ఒక్క ప్రజా సంఘం నాయకులు కూడా రాలేదని, ఒక రాజకీయ పార్టీ నాయకులు కూడా రాలేదని ఇంత అన్యాయం జరుగుతుంటే తాము కూడా ఒక దళితులమనే విషయం మరిచిపోయారా? అని అన్నారు. తమగోడు కూడా పట్టించుకోవాలని తమకు పోలీసులతో వారి ఇన్వెస్టిగేషన్ తో సంబంధం లేదని తమ వస్తువులు పోగొట్టుకొని ఉన్నామని, పెళ్లి చేయకపోతే రేణుక పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని తమకు ఎవరు న్యాయం చేస్తారని ప్రజాసంఘాలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆమె ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే పార్టీలు చూసుకోవాలని ఇలా మా దొంగతనం కేసును అడ్డంగా పెట్టుకుని పోలీసులు వేధించారు కొట్టారు అనే సాకుతో పోయిన బంగారం, నగదు లభించకపోతే తమ కుటుంబం వీధిన పడుతుందని అన్నారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బుతో పెళ్లి కోసం నగదు కొన్నామని తెలిపారు. ఈ ఆషాడం ముగియగానే పెళ్లి సంబంధం కుదిరిందని త్వరలోనే తమ ఇంట్లో వివాహం జరగబోతుందని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని రేణుక ప్రశించింది..