ముదిరాజ్లను బీసీ - ఏ లోకి మార్చాలి ము దిరాజ్లను ముదిరాజ్లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చాలి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ డిమాండ్ చే శారు.
ముదిరాజ్లను బీసీ - ఏ లోకి మార్చాలి
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:09 PM
ము దిరాజ్లను ముదిరాజ్లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చాలి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ డిమాండ్ చే శారు.

నారాయణపేట న్యూటౌన్, జూలై 14 : ము దిరాజ్లను ముదిరాజ్లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ లోకి మార్చాలి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేటలో జరిగిన ముదిరాజ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుప ర్చిన విధంగా ముదిరాజ్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసీల్దార్కు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. బారంబావి సుభాష్ రోడ్ నుంచి ఉదయం పది గంటలకు ముదిరాజ్ల ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ర్యాలీకి ముదిరాజ్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్కుమార్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
హమీలు అమలు చేయాలి
మరికల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయా లని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కానుగంటి నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని గజలమ్మ ఆలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలను అమలు చేయాలన్నారు. ముదిరాజ్లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ గ్రూపునకు మార్చాలని, ఉచితంగా చేప పిల్లలు అందించే బదులు నగదు బదిలీ చేయాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.1000 కోట్లు కేటాయించాలన్నారు. త్వరలోనే జరబోయే మంత్రి వర్గ విస్తరణలో ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్ర మంలో మండల నాయకులు పెంటమీది నర్సి ములు, జంగిడి శ్రీనివాసులు సూరిటి చంద్ర శేఖర్, కొండయ్య, సత్త న్న, కుర్మన్న, శేఖర్, రాయుడు పాల్గొన్నారు.