అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

 

జమ్ము కాశ్మీర్ :-
రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. 

బాల్తాల్, పహల్గాం మార్గా ల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రి కుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరిం చారు. 

ఇవాళ శనివారం భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్క డా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది...

 




Previous Post Next Post

نموذج الاتصال

Follow Me