*
BREAKING: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం*
*ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి*
*విషమంగా మరో ఇద్దరి పరిస్థితి*
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం
నెలకొంది. ఆదివారం సాయంత్రం జిల్లాలో కురిసిన భారీ
వర్షం ధాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహరీ గోడ కూలి అందులో పని
చేస్తోన్న నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు
తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా
ఉన్నట్లు సమాచారం. తాడూరు మండలం ఇంద్రకల్
గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన
స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స
నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు
తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు
ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు
సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.jpeg)