ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి* *విషమంగా మరో ఇద్దరి పరిస్థితి*

 *



BREAKING: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం*


*ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి*


*విషమంగా మరో ఇద్దరి పరిస్థితి*

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం





నెలకొంది. ఆదివారం సాయంత్రం జిల్లాలో కురిసిన భారీ


వర్షం ధాటికి ఓ కోళ్ల ఫామ్ ప్రహరీ గోడ కూలి అందులో పని


చేస్తోన్న నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు


తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా


ఉన్నట్లు సమాచారం. తాడూరు మండలం ఇంద్రకల్


గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన


స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన


స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స


నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు


తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు


ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు


సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow