90 కోట్ల స్థలం ఆక్రమణకు స్కెచ్‌...

 



ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉన్న రూ. 90కోట్లు విలువ చేసే స్థలంపై నిర్మాణ దారుడి కన్ను పడింది. రెవెన్యూ అధికారులు(Revenue Officers) ఎన్నికల హడావిడిలో ఉంటారనే భావనంతో స్థలం చుట్టూ రేకులు కట్టేసి, స్థలం తమదేనంటూ బోర్డు పాతేశాడు.




హైదరాబాద్: ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉన్న రూ. 90కోట్లు విలువ చేసే స్థలంపై నిర్మాణ దారుడి కన్ను పడింది. రెవెన్యూ అధికారులు(Revenue Officers) ఎన్నికల హడావిడిలో ఉంటారనే భావనంతో స్థలం చుట్టూ రేకులు కట్టేసి, స్థలం తమదేనంటూ బోర్డు పాతేశాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళవారం రేకులను తొలగించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-12 ఎమ్మెల్యే కాలనీ(Banjara Hills Road No-12 MLA Colony)కి ఆనుకొని ఉన్న హకీంపేటలో చాలా వరకు స్థలాలు ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉన్నాయి.

సర్వే నంబర్‌ 102లో 600 గజాల స్థలంపై ఆశా డెవలపర్స్‌ కన్ను పడింది. అవకాశం కోసం ఎదురు చూశారు. ఇటీవలే పార్లమెంట్‌ ఎన్నికల్లో రెవెన్యూ అధికారులు బిజీగా ఉండగా స్థలం చుట్టూ రేకులు పెట్టేశాడు. ఆశా డెవలపర్స్‌ పేరిట బోర్డు పాతేశాడు. రెవెన్యూ అధికారులు ఇటీవలే చేపట్టిన తనిఖీల్లో స్థలం ఆక్రమ ణ గురించి తెలిసింది. మంగళవారం అధికారులు ఎక్స్‌కవేటర్లతో రేకులను తొలగించి ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow