Komatiredy Venkatreddy: బాగా చదువుకోవాలని ఉంది సారూ.. చిన్నారులను చూసి మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం
ఊరు గాని ఊరు, హైదరాబాద్లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని ఓ అడ్రస్కు చేరింది. రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషి లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు. అతడిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం.
ఊరు గాని ఊరు, హైదరాబాద్లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని ఓ అడ్రస్కు చేరింది. రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషి లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు. అతడిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్లకు చెందిన ఓ మహిళ భర్త బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. భర్త చికిత్స కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. ఆ మహిళకు ముగ్గురు పిల్లలతో జీవితం గడపడం కష్టంగా మారింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సహాయాన్ని అర్థించేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి ముషిపట్ల నుంచి హైదరాబాద్ కు బస్సు ఎక్కింది. కానీ మంత్రి ఇంటి అడ్రస్ కూడా ఆమెకు తెలియదు. ఎలాగో బంజారాహిల్స్లోని మంత్రి కోమటిరెడ్డి ఇంటి అడ్రస్ను తెలుసుకుని అక్కడికి చేరింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇంతవరకు ఆమెను చూడలేదు గుర్తుపట్టలేదు. ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి దీనంగా కూర్చుంది ఆ మహిళ.
ఇంటి నుంచి బయటికి వెళ్తున్న మంత్రి.. అక్కడ కూర్చున్న ఆ మహిళను చూసి ఆరా తీశారు. ఎవరమ్మా మీరు అంటూ పలకరించారు. మంత్రి పలకరింపుతో.. భోరున ఏడుస్తూ తన కష్టాన్నంతా చెప్పింది ఆ మహిళ. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడని, అతన్ని బ్రతికించుకునేందుకు ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించానని, కానీ తన భర్త తనకు దక్కలేదని వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక పిల్లల్ని పోషించలేకపోతున్నాని విలపించింది. భర్త చికిత్స కోసం చేసిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పించాలని ఆమె మంత్రి కోమటిరెడ్డిని కోరింది.