నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ*

 *




హైదరాబాద్ :జనవరి27

ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది.


ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ.. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది.


ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? వంటి వివరాలను కమిటీ చర్చించనున్నది.


పోడు భూములు, పట్టాలు, రికార్డుల నిర్వహణ తదితరు అంశాలపై వివరాలు సేకరించనున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విధానంపై ఆరా తీయనున్నది...

Previous Post Next Post

نموذج الاتصال