*
హైదరాబాద్: జనవరి 03
గత ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని ఉపసంహకరిస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జివో జారీ చేసింది.గృహలక్ష్మీ పథకం కింద నాలుగు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఆర్థిక సహాయం 100 శాతం సబ్సిడితో అందజేసేందుకు గత ప్రభుత్వం నిర్దేశించింది.ఇందుకు సంబంధించి 2,12,095 మంది లబ్ది దారులకు శాంక్షన్ ఆర్డర్లను ఆయా జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు.కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట జాగా వున్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేనివారికి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు నిర్ణయిం చింది.ఈ క్రమంలో గతంలో వున్న గృహలక్ష్మీ పథకాన్ని ఉపంస హరిస్తూ నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు ఆయా శాఖ లకు ఆదేశాలిచ్చింది.
Tags
News@jcl