Fatal road accident on National Highway 44

 



జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం – మహబూబ్నగర్‌కు తరలింపు National Highway 44 పై మరోసారి రక్తపాతం జరిగింది. Mahabubnagar district జిల్లా జడ్చర్ల మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది. స్థానికుల సమాచారం ప్రకారం, ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 30కు పైగా ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు. 👉 ప్రమాదం ఎలా జరిగింది? ఆర్టీసీ బస్సు ముందుగా ఒక టెంపోను ఢీకొట్టినట్లు సమాచారం టెంపో నియంత్రణ కోల్పోయి హ్యుండాయ్ వెన్యూ (TS 07 KF 2689) కారును ఢీకొట్టింది కారు ముందుకు వెళ్లి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ⚠️ స్థానికుల డిమాండ్ మాచవరం ఫ్లైఓవర్ వద్ద స్పీడ్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలని, స్పీడ్ బ్రేకర్లు/బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. 🔎 ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మాతోనే ఉండండి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow